ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్, హోంమంత్రిగా వంగలపూడి అనిత సోమవారం హస్తినకు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.
స్వాగతం పలికిన వారిలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, లావు కృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, పార్థసారథి, అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ కూడా మంత్రులకు స్వాగతం పలికారు.
![]()
