గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పవిత్ర తిరుమల క్షేత్రంలో అనేక అక్రమాలు, మహాపాపాలు జరిగాయని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
![]()
