ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక పురస్కారం బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డుకు ఎంపికైనందుకు చంద్రబాబును ఎంపీలు ఘనంగా సత్కరించారు. ఆయనకు బొబ్బిలి వీణను బహూకరించారు. అదే సమయంలో, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్మోహన్ నాయుడితో ఎయిర్ పోర్టులోనే కేక్ కట్ చేయించి ఆనందం నింపారు. 
![]()
