ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసినట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల స్వరూపాన్ని మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయని వివరించారు.
![]()
