ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం ‘పంచసూత్రాల’ను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ‘రైతన్నా… మీ కోసం’ సభలో ప్రసంగించిన ఆయన, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. గత ఐదేళ్లలో జరిగిన భూ అవకతవకలను, ల్యాండ్ గోల్మాల్ను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించానని చంద్రబాబు తెలిపారు. తమకు నచ్చిన భూములు ఇవ్వని వారిని 22-ఏ జాబితాలో పెట్టి వేధించారని, వాటన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు. నాటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి కూటమి ఏర్పడిందని గుర్తుచేశారు.
![]()
