రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈ నెల 16వ తేదీన వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యమంత్రి పాల్గొనే ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి ఆమె ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు.
![]()
