ఆంధ్రప్రదేశ్ను తిరిగి ప్రగతి పథంలో నడిపి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం, రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ను అధికారుల ముందుంచారు. గడచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
![]()
