ఏపీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల లెక్కలు సిద్దం చేస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు.
ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే డీఎస్సీ -2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసారు. వచ్చే ఫిబ్రవరి లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్దం చేస్తున్నారు. కాగా.. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే నే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 గా తేల్చారు.
![]()
