ఆంధ్రప్రదేశ్కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన ఇంటెల్, ఎన్విడియా సంస్థల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. శాంటాక్లారాలోని ఇంటెల్ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో లోకేశ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ల తయారీకి బలమైన పారిశ్రామిక వాతావరణం ఉందని తెలిపారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్
) యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఐఐటీ తిరుపతి లేదా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ భాగస్వామ్యంతో అమరావతిలో “ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్” ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
![]()
