తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. దీనిని పూర్తిగా దుష్ప్రచారంగా అభివర్ణించిన ఆయన, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, “కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారుచేసే పోటులోకి వెళ్లాయా? అందుకు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?” అని సూటిగా ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ను కఠినమైన తనిఖీలకు గురిచేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఎన్ఏబీఎల్ సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ, టీటీడీ సొంత ల్యాబ్లో కూడా పరీక్షలు పాస్ అయితేనే ఆ నెయ్యిని వినియోగానికి స్వీకరిస్తారని వివరించారు.
![]()
