ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నగర అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టుకు బదులిస్తూ సీఎం ఈ హామీ ఇచ్చారు.. విశాఖలో నడకకు అనువైన ఫుట్పాత్లు, పెరిగిన పచ్చదనం నగరవాసులకు, పర్యాటకులకు మంచి అనుభూతిని పంచుతున్నందుకు సంతోషంగా ఉంది. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను కూడా ప్రారంభిస్తాం” అని ఆయన
పేర్కొన్నారు.
![]()
