నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘అఖండ 2’ నుంచి పవర్ఫుల్ టీజర్ విడుదలైంది. ‘అఖండ 2 మ్యాసివ్ తాండవం’ పేరుతో విడుదలైన ఈ టీజర్కు ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
“చెడు ఎక్కడ జరిగినా దేవుడు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు.. బీ బ్రేవ్” అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ టీజర్కు హైలైట్గా నిలిచింది. టీజర్లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. గతంలో సంచలన విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
![]()
