ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ఈరోజు జరిగిన సమావేశం పార్లమెంట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన ఈ భేటీ ఏకంగా 88 నిమిషాల పాటు కొనసాగడం ఊహాగానాలకు తావిచ్చింది. వాస్తవానికి, ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) నియామకంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, ఇది ఇంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు.
![]()
