భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయనడానికి సూచికగా, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గురువారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల పురోగతితో పాటు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు.
![]()
