దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. 2016-2019 మధ్యకాలంలో మాజీ కెప్టెన్ కోహ్లీ ఎలా బ్యాటింగ్ చేశాడో, ఈ ఇన్నింగ్స్లోనూ అదే విధంగా ఆడాడని కుల్దీప్ ప్రశంసించాడు.
రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లలో భాగంగా మొదటి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 135 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
కోహ్లీ ఇన్నింగ్స్పై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడని కొనియాడాడు. కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలోనే తన క్రికెట్ కెరీర్ ప్రారంభమైందని గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతని ఆట చూశాక తాను దాదాపు ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని అన్నాడు.
![]()
