ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్ను సృష్టించడంపై సినీ నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. ఇటువంటి చర్యలు సమాజంలో కొందరి నైతిక పతనాన్ని సూచిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఏఐ సాంకేతికతపై ఆమె స్పందిస్తూ.. “నిజాన్ని కూడా సృష్టించగలిగే ఈ కాలంలో, వివేచన మనకు గొప్ప రక్షణ. ఏఐ అనేది అభివృద్ధికి దోహదపడే ఒక శక్తి. కానీ దానిని మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యతను సృష్టించడానికి వాడటం కొందరిలో లోతైన నైతిక పతనాన్ని చూపిస్తుంది” అని అన్నారు.
![]()
