ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరో 300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను తాజాగా బ్లాక్ చేసింది. దీంతో ఇప్పటివరకు బ్లాక్ చేసిన వాటి సంఖ్య 8,400కు చేరిందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
బ్లాక్ చేసిన వాటిలో ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లు, రౌలెట్, స్లాట్స్ వంటివి అందించే ఆన్లైన్ క్యాసినోలు, బెట్టింగ్ ఎక్స్ఛేంజ్లు ఉన్నాయి. వీటితో పాటు సట్టా/మట్కా నెట్వర్క్లు, నిజమైన డబ్బుతో ఆడే కార్డ్ గేమ్ యాప్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
![]()
